ఇజ్రాయెల్‌ దాడిలో 105 మంది మృతి | Israel Strikes Beirut Residential Area In A First 105 Killed, Attacks Yemen | Sakshi
Sakshi News home page

Israel-Hezbollah War: ఇజ్రాయెల్‌ దాడిలో 105 మంది మృతి

Sep 30 2024 9:23 AM | Updated on Sep 30 2024 10:14 AM

Israel Strikes Beirut Residential Area

బీరూట్‌ : లెబనాన్‌ తీవ్రవాద గ్రూప్‌ హెజ్‌బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.

  • లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. 

  • సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

  • రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్‌బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.

  • రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్‌బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.  

  • ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌.. 20 మంది హెజ్‌బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్‌ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఐడీఎఫ్‌ ప్రకటించింది.  

  • ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్‌బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement