జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి | 11 Indians found dead at restaurant in Georgia | Sakshi
Sakshi News home page

జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి

Dec 17 2024 6:11 AM | Updated on Dec 17 2024 6:52 AM

11 Indians found dead at restaurant in Georgia

టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది.

 పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement