
దోపిడీ కేసులో నిందితుల రిమాండ్
కాచిగూడ: ప్రయాణికుడిపై దాడిచేసి అతడి నుంచి నగదు, సెల్ఫోన్ లాక్కెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్.ఎన్. జావేద్, ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప, వివరాలు వెల్లడించారు. మలక్పేట రైల్వే స్టేషన్లో కనకయ్య అనే వ్యక్తి ఎంఎంటిఎస్ రైలు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాచిగూడ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన బతుకమ్మ కుంట ప్రాంతానికి చెందిన దాసరి మౌనిక, పోతుగల్ ప్రాంతానికి చెందిన బి.సుక్కయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి సెల్ఫోన్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.
బీదర్ టు హైదరాబాద్
రాజేంద్రనగర్: బీదర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారుతో పాటు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్కు చెందిన జగదీష్, నరేందర్, చింతల్మేట్కు చెందిన రామ్ కుమార్ స్నేహితులు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు బీదర్ వెళ్లి గంజాయిని తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కారులో బీదర్ వెళ్లిన వారు మహేశ్ అనే వ్యక్తిని సంప్రదించగా అతను రూ. 40 వేలకు ఐదు కిలోల గంజాయిని విక్రయించాడు. సరుకు తీసుకుని నగరానికి వస్తుండగా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు గురువారం మధ్యాహ్నం కారును ఆపి సోదా చేయగా ఐదు కిలోల గంజాయిని గుర్తించారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.గంజాయి విక్రయించిన మహేశ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నాకు న్యాయం చేయాలి
మణికొండ/బండ్లగూడ: నీవు నాకు నచ్చావని.. నీవు లేకుండా బతకలేనని.. వెంటపడి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లయిన నాలుగు నెలల నుంచే తన నైజాన్ని బయటపెట్టి నరకం చూపించినా మౌనంగా భరించింది. తీరా ఇప్పుడు నీవు వద్దంటూ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆమె భర్త ఇంటి ఎదుట తనకు న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టింది. బాధితురాలి తల్లి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. హైదర్షాకోట్లోని సాయి బాలాజీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీధర్కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం స్రవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడి ప్రేమ నిజమని నమ్మిన ఆమె తల్లితండ్రులను సైతం ఎదిరించి అతడిని వివాహం చేసుకుంది. నాలుగు నెలలు గడవగానే తన నిజస్వరూపం బయటపెట్టిన శ్రీధర్ ఆమెను ప్రతి రోజూ వేధించేవాడు. అయినా సంతృప్తి చెందని అతను ఇటీవల మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న స్రవంతి గురువారం సాయంత్రం భర్త ఇంటి ఎదుట తల్లితో కలిసి ప్లకార్డులు పట్టుకుని మౌనదీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. చుట్టు పక్కల వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా తన దీక్షను కొనసాగిస్తోంది.
● గంజాయి అక్రమ రవాణా
● నలుగురు యువకుల అరెస్ట్
● ఐదు కిలోల గంజాయి స్వాధీనం
భర్త ఇంటి ఎదుట యువతి మౌన దీక్ష

దోపిడీ కేసులో నిందితుల రిమాండ్

దోపిడీ కేసులో నిందితుల రిమాండ్

దోపిడీ కేసులో నిందితుల రిమాండ్