
ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం
మీర్పేట: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని మీర్పేట కార్పొరేషన్ విజ్ఞానపురి కాలనీ అధ్యక్షుడు ఆర్ కృష్ణ పేర్కొన్నారు. బృంగి హాస్పిటల్ సహకారంతో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కాలనీ సెంటర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదన్నారు. కాలనీవాసుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేకంగా ప్రతీ ఆదివారం వైద్య శిబిరాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.