ఆస్ట్రేలియాలో ఉద్యోగం.. గచ్చిబౌలిలో ఆత్మహత్య

- - Sakshi

గచ్చిబౌలి: ఉన్నత చదువులు చదివి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు గచ్చిబౌలిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ సురేష్‌ తెలిపిన మేరకు.. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాజగోపాల్‌ రెడ్డి(26) ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లెలు పెళ్లి ఉండటంతో గత సంవత్సరం అక్టోబర్‌లో ఇండియాకు వచ్చాడు. వివాహ వేడుకలు ముగిసిన అంతరం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 21న ఆస్ట్రేలియాకు బయలుదేరాడు. కుటుంబ సభ్యులు బెంగళూరు ఎయిర్‌పోర్టులో రాజగోపాల్‌ రెడ్డికి వీడ్కోలు పికారు.

అయితే.. కుటుంబ సభ్యులు వెళ్లిన తరువాత బయటకు వచ్చిన రాజగోపాల్‌ రెడ్డి నేరుగా హైదరాబాద్‌కు వచ్చి లక్డీకపూల్‌, పంజగుట్ట తదితర చోట్ల హోటళ్లలో ఉన్నాడు. ఆ తరువాత గచ్చిబౌలిలో క్లౌడ్‌ కేఫ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌కు మారాడు. 31వ తేదీ కూడ ఉంటానని చెప్పి రూ.1300 చెల్లించాడు. బుధవారం రాత్రి సర్వీస్‌ బాయ్‌ ఎంత పిలిచినా స్పందించ లేదు.

దీంతో సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు మరో తాళం చెవితో డోర్‌ ఓపెన్‌చేశారు. రాజ్‌గోపాల్‌ రెడ్డి బెడ్‌ షీట్‌తో కిటికీ గ్రిల్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి నోట్‌ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలుతెలియాల్సి ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top