సాక్షి, సిటీబ్యూరో: ..... | - | Sakshi
Sakshi News home page

సాక్షి, సిటీబ్యూరో: .....

May 26 2023 4:54 AM | Updated on May 26 2023 4:54 AM

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో హైదరాబాదీలు సత్తా చాటారు. తొలి పదింటిలో నాలుగు ర్యాంకులను మన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాల్లో మూడు, ఇంజినీరింగ్‌లో ఒక ర్యాంక్‌ లభించింది. వ్యవసాయ– వైద్య విభాగంలో కొత్తపేట హరిపురి కాలనీకి చెందిన సఫల్‌ లక్ష్మి పసుపులేటి మూడో ర్యాంక్‌, బాలానగర్‌కు చెందిన డి.శ్రీధర్‌ రెడ్డి ఆరో ర్యాంక్‌, హిమాయత్‌నగర్‌కు చెందిన కె.ప్రీతమ్‌ సిద్ధార్థ్‌ పదో ర్యాంక్‌ సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో కొండాపూర్‌కు చెందిన అభినీత్‌ మాజే టి నాలుగో ర్యాంక్‌ సాధించారు. ఈ నెల 10 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజనీరింగ్‌ పరీక్షల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన సుమారు 1,71,706 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 83 శాతం అర్హత సాధించారు. మరోవైపు ప్రభుత్వ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు సైతం సత్తా చాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement