తెనాలి: అమరావతి తైక్వాండో అసోసియేషన్(గుంటూరు) ఆధ్వర్యంలో తెనాలిలో రెండురోజులపాటు నిర్వహించిన 5వ ఏపీ స్టేట్ సబ్జూనియర్, 3వ ఏపీ స్టేట్ కిడ్స్ తైక్వాండో చాంపియన్షిప్–2026లో గుంటూరు జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్లో ఈ పోటీలను నిర్వహించారు. విజేతలను సోమవారం సాయంత్రం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రన్నర్స్గా, అనకాపల్లి తృతీయస్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చాంపియన్షిప్లో తెనాలికి చెందిన తైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు. పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 300 మంది వరకు పాల్గొన్నారు. అమరావతి తైక్వాండో అసోసియేషన్, గుంటూరు కార్యదర్శి బండారు దానిశ్వరరావు పర్యవేక్షించారు.


