
మే 3న డీఎస్సీపై అవగాహన సదస్సు
లక్ష్మీపురం: డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే మూడో తేదీ సాయంత్రం 4గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో డీఎస్సీపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఆందోళన ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్న్ వచ్చిందన్నారు. నోటిఫికేషనన్పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలను తెలుపుతున్నారన్నారు. సదస్సుకు హాజరయ్యే అభ్యర్థులకు ఎడ్యుకేషన్న్సైకాలజీ, ఎస్జీటీ అభ్యర్థులకు గణితంపై కంటెంట్ బుక్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ పోటీ పరీక్షల నిపుణులు కె.ఎస్.లక్ష్మణరావు, సబ్జెక్ట్ నిపుణులు పాల్గొని వివరిస్తారని తెలిపారు. వివవరాల కోసం 9490099992 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఎం.కిరణ్, ఎస్.కె.సమీర్, ఎస్.పద్మ, సుభానీ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు సత్వరం చెల్లించాలి
లక్ష్మీపురం: ఐదు నెలల పెండింగ్ వేతనాలు సత్వరమే చెల్లించాలని డిమండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2024 డిసెంబర్ నుంచి నేటి వరకు జీతాలు, బిల్లులు పడకపోవడం వల్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం, పౌష్టికాహారం అందించడానికి తోడ్పడే మధ్యాహ్న భోజన కార్మికులపై వివక్ష చూపించడం మానుకోవాలన్నారు. ఐదు నెలల నుంచి బిల్లులు రాకపోతే కుటుంబాలు గడుస్తాయని ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. అనంతరం గ్రీవెన్స్ వినతి పత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, యూనియన్ నాయకులు చింతల శ్రీనివాసరావు, మర్రి లక్ష్మి, రెడ్డి రమణమ్మ, జ్యోతి, ముక్తేశ్వరమ్మ, సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
యూబీఐ మెగా ఎంఎస్ఎంఈ క్యాంపు
కొరిటెపాడు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం జీటీ రోడ్డులోని యూబీఐ రీజనల్ కార్యాలయంలో మెగా ఎంఎస్ఎంఈ, కాసా అవుట్ రీచ్ క్యాంపు నిర్వహించారు. యూబీఐ జనరల్ మేనేజర్ రేణు నాయర్ చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు రూ.100 కోట్ల రుణ మంజూరు పత్రాలు అందజేశారు. యూబీఐ జనరల్ మేనేజర్ రేణు నాయర్ మాట్లాడుతూ ఖాతాదారుల సౌకర్యార్థం యూబీఐ సేవలను మరింత విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. మహిళ రుణ గ్రహీతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రుణ గ్రహీతలందరిని బ్యాంకు ద్వారా ప్రోత్సహించడం గర్వనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో యూబీఐ రీజనల్ హెడ్ ఎస్.జవహర్, డెప్యూటీ రీజనల్ హెడ్స్ అశ్వర్ధ నాయక్, ఏ.రాజేష్, ఎంఎల్పీహెడ్ హరేరామ్షా, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
తెనాలిలో ఆటోడ్రైవర్ దారుణ హత్య
తెనాలిరూరల్: తెనాలి త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తి, ఇటుకలతో దాడి చేసి హతమార్చారు. మల్లెపాడు పంచాయతీ పరిధిలోని వెలగ్గుంట చెరువులో ఆదివారం రాత్రి ఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ, తలమీద కత్తులతో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. మృతుడిని మండలంలోని జగ్గడిగుంటపాలెం పంచాయతీ పరిధిలోని టిడ్కో గృహాల్లో నివసించే గండికోట రాజు(25)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపధ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిస్తాయని సీఐ ఎస్.రమేష్బాబు తెలిపారు.

మే 3న డీఎస్సీపై అవగాహన సదస్సు

మే 3న డీఎస్సీపై అవగాహన సదస్సు

మే 3న డీఎస్సీపై అవగాహన సదస్సు