వినుకొండ(నూజెండ్ల) : గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా మేడపి వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన మెప్మా సిబ్బంది విజయవాడలో జరిగే సమావేశానికి ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సులో వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రకాశం జిల్లా మేడపి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. సుమారు 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు.


