
చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశియైన మేషరాశిలో సంచరిస్తాడు. పురాణాలు చైత్రమాసాన్ని మధుమాసంగా, పవిత్ర మాసంగా కీర్తిస్తాయి. శుభాకార్యలు జరపకపోయినా..ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పండితులు. కొత్త సంవత్సరం ప్రారంభ సూచిక, మనందరికీ ఇష్టమైన ఉగాది పండుగతో ప్రారంభమయ్యే ఈ చైత్ర మాసం విశిష్టత, వ్రతాల మాసంగా పిలవడానికి కారణం తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’. ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60 ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
పురాణ గాథ!
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని సంకల్పించారు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ.
వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
వ్రతాలన్నీ ఈ మాసంలోనే..
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటి అవతారం అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం, వసంత నవరాత్రులు వంటి విశిష్టమైన వ్రతాలు ఆచరించేది ఈ మాసంలోనే.
అమ్మకు ఇష్టమేన మాసం కూడా..
అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం చైత్రమాసం. అమ్మవారిని ఈ కాలంలో పూజించిన వారికి విశేషఫలం లభిస్తుందని దేవీభాగవతమహిమ చెపుతోంది. దీనికి గల కారణం ఏమిటో శివుడే స్వయంగా బ్రహ్మవిష్ణువులకు వివరించినట్లు శివపురాణం చెపుతున్నది. ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనబడే అయిదు జగత్కార్యాలు చేస్తుంటాడు. ఈ అయిదుపనులలో సకలలోకాల ప్రాణుల ఉత్పత్తి లేక ఆరంభం, సృష్టిగా పిలుస్తారు.
ఆరంభం అయిన ప్రాణులు, లోకాలు పోషింపబడి స్థిరంగా ఉండుట అనగా, జీవుల నుంచి జీవులు ఉత్పన్నులవుతూ కొనసాగడాన్ని స్థితి అంటారు. జీవులు కొంతకాలం అభివృద్ధిని చెంది, శిథిలావస్థకు వచ్చి, వినాశమును పొందడాన్ని సంహారం అంటారు. ప్రాణం బయటకు వచ్చి వేరొక దేహాన్ని పొంది, వేరు లోకాలకు పోవడాన్ని “తిరోధానం” అంటారు. జననమరణాదిచక్రమును తొలగించి ముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. ఈ పంచకృత్యాలు నడిపించేపని భవుడు, భవానికి ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రారంభమైన కాలం చైత్రమాసం. అందువల్లనే ఈ కాలంలో భవానిని పూజించమని భవుడు చెప్పాడు.భవభవానీప్రీతికరమాసం, మధుమాసం కనుక ఈ మాసంలో ఆదిదంపతులను పూజించాలి.
రామాయణ పారాయణము చేసేది కూడా..
"రామో విగ్రహవాన్ ధర్మః" అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేసాడు. ధర్మాచరణకోసం ఎన్నో శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు. రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు ధర్మసూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి. శిష్యునిగా, ధర్మప్రభువుగా, దాతగా, రక్షకునిగా, శిక్షకునిగా ఒకటేమిటి అనేకపాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి.
సంపూర్ణమానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే. అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సౌరసంహిత చెపుతోంది. ఈ మాసంలో రామాయణ పారాయణము, శ్రవణమూ ఈ రెండూ అనంతఫలితాలను ఇస్తాయి.
మానవులజీవితాలను వారివారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగుతాయి. ఊపిరితిత్తుల రోగాలు తక్షణమే తొలగిపోతాయి. కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మాసాన్ని భక్తులందరూ తమ శక్త్యానుసారం పూజలు చేసి..ఆ భగవంతుడి కృపకు పాత్రులుకండి.
(చదవండి: