
చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను ఉద్యోగులను పంచి ఇచ్చింది. "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ వార్త నెట్టింట సందడిగా మారింది.
25 మందికి ఎస్యూవీ కార్లు గిప్ట్
లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు ప్రముఖ అటానమస్ ఏజెంట్ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు.
విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు. సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్ డాక్టర్ సీక్రెట్ ఇదే!
2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్స్ట్రాప్గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!