కెమిస్ట్రీ ప్రొఫెసర్‌నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది! | An assistant chemistry professor accused of killing her husband by electrocution | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ ప్రొఫెసర్‌నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!

May 29 2025 1:43 PM | Updated on May 29 2025 3:01 PM

An assistant chemistry professor accused of killing her husband by electrocution

క్షణికావేశంలో నేరాలు చేసేది కేవలం చదువుకోనివాళ్లే అనుకోవడం పెద్ద పొరపాటే. విద్యావంతులు, మహా మహామేధావులు సైతం ఇందుకు అతీతమేం కాదు. ఇందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయే కెమిస్టరీ మహిళా ప్రొఫెసర్‌ కేసు ఓ ఉదాహారణ. ఈ కేసులో ఆమె వాదనకు న్యాయమూర్తే విస్తుపోయారు. 

వివరాల్లోకెళ్తే.. భర్తను కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపారంటూ 60 ఏళ్ల మమతా పాఠక్‌పై అభియోగాలు నమోదయ్యాయి. డ్రైవర్‌ వాంగ్మూలం, దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు ఆమెనే నిందితురాలు అనడానికి బలం చేకూర్చాయి. మరోవైపు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ సైతం ఆమె భర్తది సాధారణ మరణం కాదని పేర్కొంది. 

మధ్యప్రదేశ్‌ హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రొఫెసర్‌ మమతా పాఠక్‌ని ప్రశ్నించారు. దానికి ఆమె జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ దేవ్‌నారాయణ్ మిశ్రా డివిజన్ బెంచ్ ముందు తన కెమిస్ట్రీ పాండిత్యం అంతా చూపించారు. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ మొత్తం తప్పు అన్నట్లుగా.. రసాయనాత్మకంగా విశ్లేషణ ఇచ్చారు. 

తాను కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపినట్లయితే.. విద్యుత్‌ ప్రవాహం కణజాలలతో ఎలా రసాయనక చర్య జరుపుతుందో కెమిస్ట్రీ ల్యాబ్‌లోనే నిర్థారించగలమని అన్నారు. ముఖ్యంగా ఆమ్ల ఆధారిత విభజనతో రసాయనిక ల్యాబ్‌లో వెల్లడించగలరని, దృశ్యమానంగా చూపించడం అసలు వీలు కాదని చెప్పారు. అందువల్ల పోస్ట్‌మార్టంలో.. శరీరంపై ఉన్నవి థర్మల్‌ బర్న్‌, విద్యుత్‌ బర్న్‌ గుర్తులా అనేది గుర్తించడం సాధ్యం కాదని వివరణ ఇచ్చారామె. 

ఆమె చెప్పింది విని జడ్జిలు నిర్ఘాంతపోయారు. ఈ కేసు న్యాయవ్యవస్థనే దిగ్బ్రాంతి గురిచేసిందని, ఇదొక అసాధారణమైన కేసుగా అభివర్ణించింది హైకోర్టు. ఈ మేరకు ధర్మాసనం మమత్‌ పాఠక్‌ కేసు విచారణ సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో ఇలా పేర్కొనడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఏప్రిల్ 29, 2021న మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో, మమతా పాఠక్ తన భర్త నీరజ్ పాఠక్‌కు అధిక మోతాదులో నిద్రమాత్రలు ఇచ్చి, కరెంట్‌ షాక్‌కు గురిచేసి హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆమె తన కొడుకుతో కలిసి ఝాన్సీకి బయలుదేరినట్లు సమాచారం. అయితే పోలీసుల విచారణలో..ఆమె తన భర్త నీరజ్‌ పాఠక్‌ని హింసించినట్లు డ్రైవర్‌ ఇచ్చిన వాంగ్మూలంతో ఆమె కేసు అనూహ్య మలుపు తీసుకుంది. 

అలాగే వైవాహిక జీవితంలో పలు వివాదాలు కూడా కారణమని తేలింది. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు ప్రణాళికతో ఈ హ్యతకు పాల్పడినట్లు నిర్థారిస్తూ సెషన్‌కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత ఆమె హైకోర్టును ఆశ్రయించి.. గతేడాదే బెయిల్‌ పొందారామె. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటే ఉన్నారు. 

(చదవండి: ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు! భారత సంతతి మహిళ భావోద్వేగం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement