అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి | Akshaya Tritiya 2025, Chinmayi Sripada Shares Post About Draupadi Akshaya Patra And Donation, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి

Apr 30 2025 12:21 PM | Updated on Apr 30 2025 1:38 PM

Akshaya tritiya 2025 Chinmayi Sripada post draupadi about donation

అక్షయ తీజ్ లేదా పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ (Akshaya tritiya 2025) అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. అక్షయ అంటే శ్రేయస్సు, నాశనం లేనిది ఆశ, విజయంతో పాటు ఆనందం పరంగా శాశ్వతత్వం ,తృతీయ అంటే చంద్రుని మూడవ దశ.ఈ రోజు ద్రౌపది, కృష్ణుడు , అక్షయ పాత్రకు సంబంధించిన పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  ఈ విషయాన్నే  ప్రస్తావిస్తూ ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi Sripada) ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ పెట్టింది.అక్షయ తృతీయ  అంటే దానం, ధర్మం చేయాల్సిన రోజని గుర్తు చేసింది.

ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది. మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులకు కాసింత ఆహారాన్ని పెట్టండి. ఈ దానమే ఇక చాలు అనే తృప్తి నిస్తుంది అని  ఇన్‌స్టాలో  పోస్ట్‌ పెట్టింది.

ద్రౌపది అక్షయ పాత్రకథ
ద్రౌపది, రాజకుమారులైన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన తపస్సు ఫలితంగా పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడికి అక్షయ పత్రం ప్రసాదించాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే పాండవులు వనవాస కాలంలో కృష్ణుడి నుండి అక్షయ పాత్రను పొందారు. ఇది ఒక మాయా పాత్ర, ఇది ఎల్లప్పుడూ వారికి ఆహారాన్ని అందించేది. ఆ అక్షయ  పాత్ర ద్రౌపది భోజనం చేసే వరకు ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది , ఆ తరువాత తలక్రిందులుగా ఉంచుతుంది. అంటే అప్పటికి ఆహారం అయిపోతుంది. ఒకసారి కోపానికి, శాపానికి పేరుగాంచిన దుర్వాస ముని తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి భోజనానికి వచ్చాడు. కానీ అప్పటికి ఆహారం అంతా అయిపోయింది . తినడానికి ఏమీ లేదు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు పాత్ర ఖాళీగా ఉండటంతో ద్రౌపది శ్రీకృష్ణుడి సహాయం కోసం ప్రార్థించింది.అలా శ్రీకృష్ణుడికి  అనుగ్రహంతో బ్రాహ్మణులందరూ స్వయంచాలకంగా పూర్తిగా సంతృప్తి చెందడంతో, దూర్వాసుడి శాపం నుంచి తప్పించుకుంటుంది ద్రౌపది.  ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడాడిన రోజే అక్షయ తృతీయ అని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?

అక్షయ తృతీయ రోజును విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఆవిర్భవించిన రోజుగా కూడా పరిగణిస్తారు.  అందుకే ఈ రోజును కొన్నిసార్లు ప్రశురామ జయంతి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం, వేద వ్యాసుడు గణేశుడికి మహాభారతం పారాయణం చేయడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. 

అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.  అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకు అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలుంటాయని, . ఈ రోజున దానం, ధర్మం, పుణ్యకార్యాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని  నమ్మకం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement