ఆగని మట్టి అక్రమ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

ద్వారకాతిరుమల: మండలంలోని సత్తాలచెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఓ పచ్చ నాయకుడు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నాడు. పెద్దస్థాయిలో మట్టి తరలింపు జరుగుతన్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో అద్దూఅదుపు లేకుండా ఈ దందా సాగిపోతోంది. గ్రామంలోని సత్తాల ఇరిగేషన్‌ చెరువులో ఓ టీడీపీ నాయకుడు రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నాడు. జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి, టిప్పర్ల ద్వారా మట్టిని బయటకు తరలించేస్తున్నాడు. ఒక్కో టిప్పర్‌ మట్టిని దూరాన్ని బట్టి రూ. 7 వేల నుంచి 12 వేలకు విక్రయిస్తున్నాడు. ప్రజాధనాన్ని బహిరంగంగా దోచేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement