
శ్రీ ప్రకాష్ విద్యార్థుల అత్యున్నత ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచారు. నందవరపు భానుతేజస్ 594, సామిరెడ్డి గీతిక 593, కడిమి అర్చన 592, ఎస్.రుత్విక 592, ఎం.స్నేహిత్ 590 మార్కులు సాధించారని పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. 550కు పైగా 91 మంది, 500కు పైగా 155 మంది మార్కులు సాధించి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఆ విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, ప్రిన్సిపాల్ మూర్తి అభినందించారు.
ఆదిత్య విద్యాసంస్థల
విజయభేరి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఏబీబీవీ సత్యసూర్యతేజ, బి.మహిత్నాయక్ 596 మార్కులు సాధించారని ఆదిత్య విద్యాసంస్థల డైరక్టర్ ఎన్.శృతిరెడ్డి బుధవారం తెలిపారు. తమ విద్యాసంస్థల నుంచి 590కి పైగా 53 మంది, 550కు పైగా 465 మంది మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి,డైరక్ట్ ఎస్వీ రాఘవరెడ్డి అభినందించారు.
బాలికపై యువకుడి లైంగిక దాడి
అన్నవరం: అన్నవరంలో పదేళ్ల బాలికపై 20 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకు వెనుక గల ఒక ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పక్కింటి ఆమె దుకాణానికి వెళ్లి పంచదార తెమ్మని పంపించింది. ఆ బాలిక దుకాణానికి వెళ్లి పంచదార కొనుగోలు చేసి ఇంటికి తెచ్చింది. ఆ సమయంలో పక్కింటి ఆమె ఇంట్లో లేదు. ఆమె కొడుకు 20 ఏళ్ల కొల్లు సతీష్ ఉన్నాడు. అతడు ఆ పంచదార వంటింట్లో పెట్టాలని చెప్పాడు. బాలిక వంటింట్లోకి వెళ్లగానే తలుపునకు గెడపెట్టి ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి ఆలశ్యంగా తెలియడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి బాబు తెలిపారు. సుమారు 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీ ప్రకాష్ విద్యార్థుల అత్యున్నత ప్రతిభ