గన్నవరంలో బొలెరో బీభత్సం

Road Accident In Gannavaram - Sakshi

బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లిన బొలెరో

సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరంలో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. హెచ్‌పీ గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి పాదచారులపైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాదచారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. మృతుడు దావాజిగూడెంకు చెందిన నాగయ్యగా పోలీసులు గుర్తించారు. బోలెరో వాహనం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top