HYD: శ్రుతి కేసులో వీడిన మిస్టరీ | Nursing student Gachibowli hotel Case Mystery Solved | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యార్థిని శ్రుతి కేసులో వీడిన మిస్టరీ

Sep 19 2024 10:35 AM | Updated on Sep 19 2024 10:46 AM

Nursing student Gachibowli hotel Case Mystery Solved

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడడం తెలిసిందే. అయితే ఈ కేసులో మిస్టరీ వీడింది. శృతిది రేప్‌ అండ్‌ మర్డర్‌ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చేశారు.

జడ్చర్లకు చెందిన శ్రుతి (23).. మూడు రోజుల కిందట గచ్చిబౌలి రెడ్‌ స్టోన్‌ హోటల్లో ఫ్యాన్కు శవమై వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. గదిలో బీర్‌ బాటిల్స్‌ ఉండడం,  అంతా చిందరవందరగా ఉండడంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. మృతదేహాన్ని తరలించకుండా ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెపై హత్యాచారం జరిగిందన్నది వాళ్ల ప్రధాన ఆరోపణ. దీంతో పోలీసులు వాళ్లకు సర్ధిజెప్పి ఉస్మానియాకు బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు.

ఈలోపు కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆమెది ఆత్మహత్యగానే తేల్చారు. ‘‘శ్రుతి గత కొంతకాలంగా జీవన్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే పెళ్లికి  ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో  మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారు. జీవన్‌ తన తన ఫ్రెండ్‌ గదికి వెళ్లిపోయాడు. శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది’’ అని వివరాలను తెలిపారు. ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న పోలీసులు.. జీవన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement