
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పై ఉన్న ఫర్నిచర్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాటుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు సమీపంలో ఉన్న మరో మూడు దుకాణాలకూ వ్యాపించాయి. శ్రీ ఫుట్ వరల్డ్, ఎంఎస్ ఫర్నిచర్, ఫుట్ నీడ్స్, వాచెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్లు తగలబడిపోయాయి.