సెమీకండక్టర్స్‌ తయారీలోకి జోహో | Zoho Corp to venture into chip making | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్స్‌ తయారీలోకి జోహో

May 17 2024 6:10 AM | Updated on May 17 2024 12:42 PM

Zoho Corp to venture into chip making

700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి యోచన 

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 

1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్‌ డిజైన్‌ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్‌ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్‌ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్‌ 2026 నాటికి 63 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement