విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌

Wipro Executive Chairman Rishad Premji Halves His Salary This Year - Sakshi

సాక్షి, ముంబై:  విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం  తీసుకున్నారు.  ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ  క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్‌జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు)

యుఎస్‌లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం రిషద్ ప్రేమ్‌జీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీతంలో స్వచ్ఛందంగా 50 శాతం కోత  విధించుకున్నారు. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్‌, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌)

మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం వార్షిక పరిహారంగా 951,353 డాలర్లు పొందగా , మునుపటి సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా  ప్రేమ్‌జీ ప్రస్తుత 5 సంవత్సరాల పదవీకాలం జూలై 30, 2024న ముగియనుంది. 

ఇదీ చదవండి: యాపిల్‌ స్పెషల్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ ట్రావెల్‌ మగ్‌, ధర వింటే..!

ఇలాంటి మరెన్సీ కార్పొరేట్‌ వార్తలు, విశేషాలకోసం చదవండి: సాక్షిబిజినెస్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top