
ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్లను మార్చుకోవడానికి సమయం దొరికింది.
వాట్సప్కు సపోర్ట్ చేయని మొబైల్స్..
➤ఐఫోన్ 5ఎస్
➤ఐఫోన్ 6
➤ఐఫోన్ 6 ప్లస్
➤ఐఫోన్ 6ఎస్
➤ఐఫోన్ 6s ప్లస్
➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)
➤శామ్సంగ్ గెలాక్సీ ఎస్4
➤శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3
➤సోనీ జెడ్పీరియా జెడ్1
➤ఎల్జీ జీ2
➤హువావే అసెండ్ పీ6
➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)
➤మోటరోలా రేజర్ హెచ్డీ
➤మోటో ఈ 2014
జాబితాలోని అన్ని ఫోన్లు చాలా పాత వెర్షన్లు. అయితే కొన్ని ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్ పనిచేసే అవకాశం ఉంది.
ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
గత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.