
దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్’ లిస్ట్ ప్రకారం పది మంది తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా సాఫ్ట్వేర్, హెల్త్కేర్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మొదటి నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.
ఇదీ చదవండి: ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
లిస్ట్లో జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో ఉన్నారు. టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్లో ఉండగా, మిగిలిన ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం సంపదలో రూ.1.11 లక్షల కోట్లతో సాఫ్ట్వేర్, సేవల రంగం ఆధిపత్యం సాగిస్తోంది. హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్ టైల్స్, మీడియా తదితర రంగాలకు చెందినవారున్నారు.
పేరు | సందప(రూ. కోట్లల్లో) | వయసు | కంపెనీ |
రాధా వెంబు | 55,300 | 52 | జోహో కార్పొరేషన్ |
జయశ్రీ ఉల్లాల్ | 48,900 | 63 | అరిస్టా నెట్ |
కిరణ్ మజుందార్ షా | 32,000 | 71 | బయోకాన్ |
ఫాల్గుణి నాయర్ | 29,000 | 61 | నైకా |
నేహా నర్ఖేడే | 6,800 | 41 | సంగమం |
కవితా సుబ్రమణియన్ | 6,500 | 43 | అప్స్టాక్స్ |
నేహా బన్సాల్ | 5,100 | 43 | లెన్స్కార్ట్ |
ఇంద్ర కె నూయి | 4,800 | 69 | పెప్సికో |
జూహీ చావ్లా | 4,600 | 57 | నైట్ రైడర్స్ |
మీనా సేథీ | 2,700 | 80 | ఓరియంట్ ఫ్యాషన్ |