
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా, నిఫ్టీ 200 పాయింట్లకు దగ్గరగా లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 544.86 పాయింట్లు లేదా 0.77 శాతం ఎగిసి 71,684.76 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 186 పాయింట్లు లేదా 0.86 శాతం లాభపడి 21,708.10 వద్ద ట్రేడింగ్ను ముగించింది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐచర్ మోటర్స్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, టాటా మోటర్స్ షేర్లు చక్కటి లాభాలను అందుకుని టాప్ గెయినర్స్గా నిలిచాయి. లార్సెన్, టైటాన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బీపీసీఎల్ షేర్లు టాప్ లూజర్స్గా నష్టాలతో డీలా పడ్డాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)