ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే.. | Telecommunications Bill 2023 Was Introduced In Lok Sabha | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..

Dec 18 2023 2:20 PM | Updated on Dec 18 2023 2:38 PM

Telecommunications Bill 2023 Was Introduced In Lok Sabha - Sakshi

ఇంటర్‌నెట్‌తో నడిచే కాలింగ్‌/ మెసేజింగ్‌ యాప్స్‌తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. 

కేంద్ర  టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్  ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్‌తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్‌ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి.  దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే  ఎలాంటి నెట్‌వర్క్ లేదా టెలికమ్యూనికేషన్  సేవలనైనా  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది.

తాజా డ్రాఫ్ట్‌ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే  కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. 

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement