దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,146 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు క్షీణించి 77,220 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50 ఇండెక్స్ లో సిప్లా, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.06 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగాయి.
- అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02
- బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.42 డాలర్లు
- యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.72 శాతానికి చేరాయి.
- గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.
- నాస్డాక్ 0.76 శాతం నష్టపోయింది.
Today Nifty position 25-08-2026(time: 10:07 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


