స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on may 29 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

May 29 2025 9:49 AM | Updated on May 29 2025 9:49 AM

stock market updates on may 29 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.56 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.51 శాతం పడిపోయింది.

పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు నిన్నటి మార్కెట్‌ సెషన్లో 3% పడి సూచీల పతనానికి ప్రధాన కారణమైంది. నిన్న సూచీలు ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. మే నెల వారీ ఎక్స్‌పైరీ గడువు ముగింపు(నేడు), దేశీయ క్యూ4 జీడీపీ, ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్‌లో ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మీడియా, ఇంధన షేర్లు రాణించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement