25,000 మార్కు వద్ద నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

25,000 మార్కు వద్ద నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Sep 12 2024 9:30 AM | Updated on Sep 12 2024 9:46 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 25,022కు చేరింది. సెన్సెక్స్‌ 322 పాయింట్లు లాభపడి 81,857 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 101.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70.8 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 3.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.07 శాతం, నాస్‌డాక్‌ 2.2 శాతం లాభపడ్డాయి.

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆగస్టులోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ఈ ఏడాది జులైలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. థీమ్యాటిక్‌ ఫండ్స్‌ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జులైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement