సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

Jan 23 2024 3:43 PM | Updated on Jan 23 2024 3:55 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ మార్కెట్‌ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1,053 పాయింట్లు దిగజారి 70,370 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, భారతిఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్టాక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాన్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ముగించాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాలర్లకు చేరింది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ శనివారం రూ.545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ సైతం రూ.719.31 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement