
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455.38 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 82,176.45 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 25,001.15 వద్ద నిలిచాయి.
శ్రేయాన్స్ ఇండస్ట్రీస్, ఖైతాన్ (ఇండియా), ఎక్సారో టైల్స్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్, వాక్స్టెక్స్ కాట్ఫ్యాబ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫేజ్ త్రీ, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఎమ్బి ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).