శుక్రవారం ఉదయం నష్టాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 607.08 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో 76,802.90 వద్ద, నిఫ్టీ 154.90 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 24,013.10 వద్ద నిలిచాయి.
రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్, రాణే (మద్రాస్) లిమిటెడ్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సోమ్ డిస్టిలరీస్ & బ్రూవరీస్ లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఆర్ఆర్ఐఎల్ లిమిటెడ్, మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


