బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్‌: కియోసాకి | Robert Kiyosaki says Everyone talking about gold right now | Sakshi
Sakshi News home page

బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్‌: కియోసాకి

Jun 18 2026 2:36 PM | Updated on Jun 18 2026 2:50 PM

Robert Kiyosaki says Everyone talking about gold right now

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్‌ రిజర్వ్‌ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  

కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్‌ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్‌ సేవర్స్‌" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు.  

"గోల్డ్‌ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్‌ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు.  

ఆయన ప్రకారం, గోల్డ్‌ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement