రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ | Railways spending 45pc in subsidy on passenger travel | Sakshi
Sakshi News home page

రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ

Aug 14 2025 5:18 PM | Updated on Aug 14 2025 5:43 PM

Railways spending 45pc in subsidy on passenger travel

మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్‌ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.

ఉదాహరణకు ప్యాసింజర్‌ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.

కొన్ని గణాంకాలు

  • 2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 13,169.

  • 2024–25లో ఈ ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 13,940.

  • 2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86

  • దేశంలో 2025 ఆగస్ట్‌ 7 నాటికి నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు 144

  • 2023–24లో ప్యాసింజర్‌ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లు

  • రైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement