దేశీయంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను రహదార్లపైకి తెచ్చిన తొలి భారతీయ సంస్థగా ఘనత సాధించినట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ వెల్లడించింది. హిమాచల్ రోడ్డు రవాణా కార్పొరేషన్కి 4,000వ బస్సును లాంఛనంగా అందజేయడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు వివరించింది. ఇది కంపెనీకే కాకుండా భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కూడా కీలక సందర్భమని కంపెనీ ఎండీ మహేష్ బాబు చెప్పారు.
విశ్వసనీయమైన పనితీరు, తక్కువ నిర్వహణ వ్యయాలు, పర్యావరణానికి గణనీయంగా ప్రయోజనాలను అందించేలా తమ బస్సులు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సులు మొత్తం మీద 730 మిలియన్ గ్రీన్ కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాయని, 6.5 లక్షల టన్నులపైగా కర్బన ఉద్గారాలను నివారించాయని కంపెనీ పేర్కొంది.


