ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు | NSE registered investor base crosses 10 crore unique investors | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు

Aug 9 2024 5:39 AM | Updated on Aug 9 2024 8:07 AM

NSE registered investor base crosses 10 crore unique investors

5 నెలల్లోనే కోటిమంది జత 

19 కోట్లకు క్లయింట్ల ఖాతాలు 

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్‌ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్‌లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్‌ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్‌ 8) యూనిక్‌ రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్‌) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్‌ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం.  

25ఏళ్లు.. 
నిజానికి ఎన్‌ఎస్‌ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్‌ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్‌ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్‌ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్‌ఎస్‌ఈ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ ఆఫీసర్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement