-
మస్క్, జుకర్బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్బర్గ్లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
బ్లూ టిక్పై డబ్బులు..సమర్ధించిన మస్క్ సలహాదారుడు శ్రీరామ్ కృష్ణన్
ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్లూటిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని చేసిన ప్రకటనపై మండి పడుతున్నారు. అయినా విమర్శల్ని పట్టించుకోని మస్క్ ట్విటర్ బోట్ అభివృద్ధి, ట్రోల్స్ను అరికట్టేందుకు ఏకైక మార్గమని సమర్ధించుకున్నారు. తాజాగా ట్విటర్లో మస్క్ సలహాదారుడు, భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సైతం సంస్థ చేస్తున్న మార్పులు సరైనవేనని అన్నారు. పెయిడ్ వెరిఫికేషన్పై యూజర్లు చేస్తున్న విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్పై ట్విటర్ 8 డాలర్లు వసూలు చేయడాన్ని సమర్దిస్తూ.. అందుకు నాలుగు కారణాల్ని వెల్లడించారు. ఆ కారణాలు ఇలా ఉన్నాయి ► ప్రముఖుల పేర్లతో ఉపయోగించే పేరడీ అకౌంట్లను గుర్తించి వారి చర్యలు తీసుకోవచ్చు ► ట్విటర్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన యూజర్లు చాలా మంది ఉన్నారని, కాని ఇకపై అలాంటి వారిని వెరిఫై చేయమని చెప్పారు. ప్రముఖులు, సాధారణ యూజర్లు.. ఇలా స్థాయితో సంబంధం లేకుండా 8 డాలర్ల చెల్లించిన వారికి వెరిఫికేషన్ ఇస్తామని అన్నారు. ► ప్రస్తుతం ట్విటర్లో తీవ్రమైన స్పామ్ సమస్యలు ఉన్నాయని కృష్ణన్ చెప్పారు. విటాలిక్ ,ఎలన్ మస్క్లు బ్లూ టిక్ వెరిఫికేషన్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు గుర్తించారు. బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆ దాడుల సంఖ్యను తగ్గించవచ్చు. ► చివరగా, ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది ఏ యూజర్ ఎవరి గురించి ఏం చెప్పారు అనే అంశంపై స్పష్టత ఇస్తుంది. నకిలీ సమాచారాన్ని ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టే ట్విటర్ 8 డాలర్లు వసూలు చేస్తున్నట్లు కృష్ణన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. Several of the critiques of the $8 / verification are logically inconsistent. “verification solves for impersonation, this will cause more” 1. using a CC/mobile checkout dramatically increases friction. And everyone caught impersonating will lose their money. — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 2. there are lots of people who should be verified ( and often impersonated) and aren’t. And vice versa. The current path on any social network is opaque and easily gamed. $8 gives a consistent path for anyone regardless of their level of notability ( which is subjective). — Sriram Krishnan - sriramk.eth (@sriramk) November 6, 2022 చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
ట్విట్టర్కు శ్రీరామ్ రిపేర్లు
న్యూయార్క్: దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను సంస్కరణల బాట పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసిన దాని నూతన అధిపతి ఎలాన్ మస్క్ దృష్టి టెక్నాలజీ నిపుణుడు, చెన్నై వ్యక్తి శ్రీరామ్ కృష్ణన్పై పడింది. టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా విశేష అనుభవం ఉన్న శ్రీరామ్కు ట్విట్టర్లో కీలక మార్పులు చేర్పుల తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ గతంలో అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో 2001–05లో ఇంజనీరింగ్(ఐటీ) పూర్తిచేశారు. మైక్రోసాఫ్ట్లో వృత్తిజీవితం మొదలుపెట్టిన ఈయన 2017లో కొంతకాలం ట్విట్టర్లో పనిచేశారు. సెర్చ్, డిస్కవరీ, హోమ్ టైమ్లైన్, ఆన్ బోర్డింగ్/న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ గ్రోత్ వంటి కోర్ ప్రొడక్ట్ విభాగాలకు నాయకత్వం వహించారు. రీ–డిజైన్ చేసిన ఈవెంట్ ఎక్స్పీరియన్స్ ఉత్పత్తులను స్వయంగా ప్రారంభించారు. స్నాప్, ఫేస్బుక్ వంటి సంస్థలకు మొబైల్ ప్రకటనల ఉత్పత్తుల అభివృద్ధిని పర్యవేక్షించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడుల (వెంచర్ క్యాపిటల్) సంస్థ అడ్రెసెన్ హోరోవిట్జ్(ఏ16జెడ్)లో ప్రస్తు తం భాగస్వామిగా ఉన్నారు. బిట్సీ, హోప్ఇన్, పాలీవర్క్ సంస్థలకూ సేవలందిస్తున్నారు. -
ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?
ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దాదాపు రూ.3.3 లక్షల కోట్లు వెచ్చించి తనకు ఏమాత్రం అనుభవం లేని సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. వరుస నిర్ణయాలతో ట్విటర్ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా..అందుకు ఓ భారతీయుడు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత తన మొదటి రోజే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్,లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ సహా మరికొంత మంది టాప్ ఎగ్జిక్యూటీవ్లను తొలగించారు. ఆ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ, ప్రస్తుతం ట్విటర్లో 280 పదాలు మించకుండా ట్వీట్ చేయాలి. ఇప్పుడు ఆ పదాల సంఖ్యను పెంచాలనుకోవడం’ వంటి నిర్ణయాలతో చర్చాంశనీయంగా మారారు. అయితే ట్విటర్లో మస్క్ నిర్ణయాలకు భారతీయుడైన శ్రీరామ్ కృష్ణన్ సాయం చేస్తున్నారు. స్వయంగా అతనే మస్క్కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. నేను మరి కొంతమంది గొప్ప వ్యక్తులు కలిసి ట్విటర్లో మస్క్కి సహాయం చేస్తున్నాం. నేను, టెక్ కంపెనీ (16z)లు చేసే పని లేదా నిర్ణయాలు ప్రపంచంపై, వాటిని నిర్విర్తించే ఎలాన్ మస్క్పై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని నమ్ముతున్నాను అని ట్వీట్లో పేర్కొన్నారు. శ్రీరామ్ కృష్ణన్ ఎవరు? చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్గా తన కెరియర్ను ప్రారంభించారు .ఆ తర్వాత డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, డిస్ప్లే అడ్వర్టైజింగ్లో అతిపెద్ద నెట్వర్క్లలో ఒకటైన మెటా (ఫేస్బుక్), స్నాప్లలో ఆడియన్స్ నెట్వర్క్తో పాటు, వివిధ మొబైల్ యాడ్ ప్రొడక్ట్లను తయారు చేశారు. ఓ పైపు దిగ్గజ కంపెనీల్లో ప్రాజెక్ట్లు చేస్తూనే వెంచర్ క్యాప్టలిస్ట్గా ఎదిగారు. 2021 ప్రారంభంలో కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్ల నుండి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టోకరెన్సీల వరకు అన్నీంటిపై చర్చలు జరిపేందుకు క్లబ్హౌస్ టాక్ షోను ప్రారంభించారు. ఆర్తి రామమూర్తి హోస్ట్గా వ్యవహరించిన ఆ షోకి ఎలాన్ మస్క్ గెస్ట్గా అటెండ్ అవ్వడం, సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో ట్విటర్లో ఎలాన్ మస్క్ తీసుకునే ప్రతి నిర్ణయంపై భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ సలహాల్ని, సూచనల్ని అందిస్తున్నారు. చదవండి👉 భారత్పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మతతత్వ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
హజ్ యాత్రికులకు ఉచితంగా వ్యాక్సినేషన్
పింఛన్ కోసం వెళ్తూ..
నిఘా నేత్రం.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
జిల్లాలో 28 మోడల్ పోలింగ్ కేంద్రాలు
ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురి అరెస్ట్
ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి
భీకర గాలులు–నేలకొరిగిన చెట్లు
ఇచ్చాపురం జనసంద్రం..
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement