registered
-
యాక్టివ్గా ఉన్న కంపెనీలు 65 శాతమే
న్యూఢిల్లీ: దేశీయంగా రిజిస్టరయిన సంస్థలు 28 లక్షల పైచిలుకు ఉండగా, వాటిలో 65 శాతం సంస్థలు (దాదాపు 18.1 లక్షలు) మాత్రమే చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 9,43,934 సంస్థలు మూతబడ్డాయి. కంపెనీల చట్టం 2013 కింద నమోదు చేసుకున్న విదేశీ సంస్థలు 5,216 ఉండగా జనవరి నాటికి వాటిలో 3,281 సంస్థలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ విడుదల చేసిన నెలవారీ బులెటిన్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రంగాలవారీగా చూస్తే అత్యధికంగా బిజినెస్ సర్వీసుల విభాగంలో 27 శాతం కంపెనీలు, తయారీ రంగంలో 20 శాతం, పర్సనల్..సోషల్ సర్వీసులు వంటి విభాగాల్లో 13 శాతం సంస్థలు పని చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో యాక్టివ్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలునిరుద్యోగం రేటు తగ్గుముఖందేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు తగ్గింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం.. 2024–25 అక్టోబర్–డిసెంబర్ కాలంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 6.4 శాతానికి వచ్చి చేరింది. జూలై–సెపె్టంబర్లోనూ ఇదే స్థాయిలో నమోదైంది. 2023–24 డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో నిరుద్యోగిత రేటు 2024 అక్టోబర్–డిసెంబర్లో 8.1 శాతానికి తగ్గింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది. 2024 జూలై–సెపె్టంబర్లో ఈ రేటు 8.4 శాతం. ఇక పురుషుల్లో నిరుద్యోగిత రేటు అంత క్రితం ఏడాది మాదిరిగానే 2024 అక్టోబర్–డిసెంబర్లో 5.8 శాతం వద్ద స్థిరంగా ఉంది. 2024 జులై–సెప్టెంబర్లో ఇది 5.7 శాతం నమోదైంది. -
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
సాక్షి, హైదరాబాద్: భూభారతి (ధరణి) పోర్ట ల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టా భూమి గల రైతులకు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగి స్తారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసే ‘ఆర్ఓఎఫ్ఆర్’ పట్టాదారులకు సైతం రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుండగా, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయంగా అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. డీబీటీ విధానంలో జమఈ నెల 26వ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవ సాయ యోగ్యమైన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున జమ చేయ నున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో అమలయ్యే ఈ పథకానికి సాయాన్ని ఆర్బీఐ నిర్వహించే ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీ టీ)’ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బాధ్యత తీసుకొంటారు. పథ కానికి సంబంధించిన లోటుపాట్లపై వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పు డు తగిన చర్యలు తీసుకుంటారు. వ్య వసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిర త్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించేలా చూడటమే రైతుభరోసా ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.10 లక్షల కుటుంబాలకు ఆత్మియ భరోసా! ‘ఇందిరమ్మ ఆత్మియ భరోసా’ పథకం కింద 10 లక్షల వ్యవసాయ కూలీ కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు. ఇందులో కనీసం 10 రోజులు పనిచేసిన కుటుంబాలు 11 లక్షలు ఉండగా, కనీసం ఒకరోజు పని చేసిన కుటుంబాలు 15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20 రోజుల పనిని ప్రామాణికంగా తీసుకుంటే 10 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మియ భరోసా కింద లబ్ధి చేకూరే చాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,200 కోట్లు వెచ్చించనుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసాగ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూ మిలేని వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించేందుకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో నమోదు చేయబడి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయాన్ని డీబీటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ (కమిషనర్) నోడల్ విభాగంగా, జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. -
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
గాడిద మృతితో గందరగోళం.. 65 మందిపై కేసు నమోదు
బక్సర్: బీహార్లోని బక్సర్ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక గాడిద మృతి అనంతరం గందరగోళం చెలరేగింది. ఇది పోలీసుల వరకూ చేరడంతో వారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 65 మందిపై కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని కేసత్ బ్లాక్లో విద్యుదాఘాతం కారణంగా గాడిద మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలోనివారు ఆందోళనకు దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. ఈ దరిమిలా పోలీసులు 65 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభమ్ ఆర్య మీడియాకు తెలియజేస్తూ సంఘటన జరిగిన వెంటనే చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్కు చేరుకున్న పలువురు గ్రామస్తులు మృతిచెందిన గాడిదకు సంబంధించిన పరిహారం వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు పవర్ గ్రిడ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన 65 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ట్యాంకర్ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా.. -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
కోహిర్@ 8.9
సాక్షి,నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. రాత్రివేళనేకాదు...పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూరు(యు)లో 9.7 డిగ్రీలు నమోదు కావటంతో వాతావరణశాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే... రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 12.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎంత దారుణం: అయిదేళ్లలో దేశంలో ఇన్ని అఘాయిత్యాలా!
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా) కింద 2019 లో 1,948 మంది అరెస్టయ్యారని, 34 మంది దోషులుగా తేలారని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2015-2019 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుండి అత్యధికకేసులు నమోదుకాగా, తర్వాత రాజస్థాన్, యూపీ తరువాతి స్థానాల్లో నిలిచాయి డీఎంకే సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీఎంకే సభ్యుడు తిరుచి శివ ఈ ప్రశ్నను అడిగారు. అయిదేళ్లలో 1.71 లక్షల అత్యాచారాలు.. 2015-19 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచారాలు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లోనే నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లో 22,753, రాజస్తాన్లో 20,937, ఉత్తరప్రదేశ్లో 19,098, మహారాష్ట్రలో 14,707, ఢిల్లీలో 8,051 అత్యాచారాలు జరిగాయి. సీఏఏ సవరణ లేదు.. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి సవరణలు చేసే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. మార్పులేమైనా తీసుకొచ్చి ఇతర మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తారా అన్న ప్రశ్నకు ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతేపాదనేదీ తమకు లేదని స్పష్టం చేశారు. 2019 చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. 12,600 శత్రు ఆస్తులు.. దేశంలో 12,600కు పైగా శత్రు ఆస్తులను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సీఈపీఐ) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర మంత్రి అజయ్కుమార్ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించారు. భారత్ వదలి పాకిస్తాన్, చైనాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. ఇందులో పాకిస్తాన్కు వెళ్లిన వారి ఆస్తులు 12,485కాగా, 126 చైనాకు వెళ్లిన వారివి. శత్రు ఆస్తుల్లో అధికంగా ఉత్తరప్రదేశ్లోనే (6,255) ఉన్నాయి. ఆర్నెళ్లలో 12,001 సైబర్ ఘటనలు.. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో 12,001 సైబర్ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో 11,58,208, 2021 (జూన్ వరకు) 6,07,220 సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగినట్లు తెలిపారు. సీఏపీఎఫ్లో 680 ఆత్మహత్యలు.. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) గత ఆరేళ్లలో మొత్తం 680 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ విషయాలను రాజ్యసభకు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రమాదాల కరాణంగా 1,764 మంది, ఎన్కౌంటర్లలో 323 మంది మరణించారని తెలిపారు. ఆత్మహత్యలకు ఆర్థిక కారణాలు, అనారోగ్యం వంటివి ఉండొచ్చని అన్నారు. 183 మంది రైతులు అరెస్టు.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల వద్ద గత ఏడాది నుంచి నిరసనలు చేపట్టిన ఘటనల్లో ఢిల్లీ పోలీసులు మొత్తం 183 మంది రైతులను అరెస్టు చేశారని కేంద్రం రాజ్యసభలో తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ దీనికి సంబంధించి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశద్రోహ చట్టం, ఉపా చట్టం వంటి వాటిని వారిపై ప్రయోగించలేదని పేర్కొన్నారు. 630 మంది ఉగ్రవాదులు హతం మూడేళ్లలో జమ్మూకశ్మీర్లో జరిగిన 400 ఎన్కౌంటర్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా అందించారు. ఎన్కౌంటర్లలో 85 మంది భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా మరణించారన్నారు. 2018 మే నుంచి 2021 జూన్ వరకు సంబంధించిన వివరాలు ఇవి అని తెలిపారు. 4,046 మందిదరఖాస్తులు పరిశీలనలో.. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన హిందువులు 4,046 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని, అవి పలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ విషయాలను రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. వీటిలో రాజస్తాన్ ప్రభుత్వం వద్ద 1,541 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2016-2020ల మధ్య మొత్తం 4,171 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు. -
Hyderabad: హైటెక్స్లో రేపు 40 వేల మందికి టీకాలు
సాక్షి, హైదరాబాద్( రాయదుర్గం) : దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు వేసేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో కలసి మెడికవర్ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్ను చేపడుతోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా టీకాల కార్యక్రమం జరుగుతుందని, ఇందుకోసం 500 కౌంటర్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. టీకాలకు అర్హులైన (18 ఏళ్లు నిండిన) వారు http://medicoveronline.com/vaccination వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, కోవాగ్జిన్ టీకా వేస్తామని పేర్కొన్నారు. టీకా ధరను అన్ని చార్జీలతో కలిపి రూ.1,400గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 040–6833 4455 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. చదవండి: టిప్పన్ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి? -
జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు
సాక్షి, ఆలేరు : జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా వివిధ పా ర్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లలో నాలుగు శాతం సంపాదించ గలిగితే దానిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ రాష్ట్రం, లేదా ఒక ప్రాంతంలో నాలుగుశాతం ఓట్లు సాధిస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ.. వ్యక్తుల వల్లగానీ పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. జాతీయ పార్టీలు.. దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు. దేశంలోని జాతీయ పార్టీలు.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్పార్టీ, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. రిజిస్టర్డ్, అన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేస్తుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా.. చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒక వేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తుంది. అయితే వారికి ఇండిపెండెంట్ అభ్యర్థులకన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్, ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ఫ్రీ సింబల్స్ను సిద్ధంగా ఉంచుతారు. -
ముస్లిం పెళ్లిళ్లు ఆన్లైన్లో నమోదు
సాకి, హైదరాబాద్: ముస్లింల పెళ్లిళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కోసం కసరత్తు సాగుతోంది. నాజిరుల్ ఖజాత్ (ఖాజీ కేంద్ర ప్రతినిధి) కార్యాలయం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి పెళ్లి వివరాలు స్థానిక ఖాజీలతోపాటు రాష్ట్ర నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదవుతున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్లనూ జారీ చేస్తున్నారు. ఇదంతా రాతపూర్వకంగా సాగుతోంది. పెళ్లిళ్ల వివరాలు రాష్ట్ర నాజి రుల్ ఖజాత్ కార్యాలయంలో నమోదు కావడం ఆలస్యమవుతోంది. ఆన్లైన్లోనైతే ఏరోజుకారోజు వివరాలు నమోదవుతాయని భావించిన అధికా రులు ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు. పెళ్లి సమయంలో తప్పుడు దస్తావేజులు నమోదు చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఇక ఉండదు. ఆన్లైన్లో మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ పెళ్లి సమయంలో ఖాజీలకు సమర్పించే వధూవరుల ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఇంటి అడ్రస్, ఇరువురు తరఫున సాక్షుల వివరాలతోపాటు పెళ్లి జరిగిన ప్రదేశం తదితర దస్తావేజులు మొత్తం ఆన్లైన్లో నమోదవుతాయి. ఇదివరకే పెళ్లి అయినా ఇంకా పెళ్లి కాలేదంటూ వధూవరులు తప్పుడు సమాచారమిస్తే వెంటనే తెలిసిపోతుంది. పెళ్లిళ్లలో మోసాలకు ఈ విధానంతో అడ్డుకట్ట పడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి వక్ఫ్ బోర్డు యత్నాలు ప్రారంభించింది. సర్టిఫికెట్ కావాలంటే పెళ్లి పుస్తకాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్ను ఆన్లైన్లో జారీ చేస్తారు. కార్యకలాపాలు సులభతరం పెళ్లిళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఖాజీలతోపాటు నాజిరుల్ ఖజాత్ కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రక్రియ సులభతరమవుతుంది. ఆన్లైన్ ప్రక్రియను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మేరకు ఒక ఐటీ కంపెనీని సంప్రదించాం. ఈ నెల 24వ తేదీ జరిగే బోర్డు కార్యవర్గ సమావేశంలో ఈ ప్రక్రియ గురించి కంపెనీ ప్రతినిధులు వివరిస్తారు. – రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం -
తేజ్పాల్పై రేప్ అభియోగాల నమోదు
పణజీ: తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్(54)కు గోవాలోని మపుస జిల్లా కోర్టు షాకిచ్చింది. 2013లో తోటి మహిళా జర్నలిస్ట్పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 354ఏ (లైంగిక వేధింపులు) 354బీ (మహిళను వివస్త్ర చేయడం), 341, 342 (కుట్రపూరితంగా నిర్బంధించడం) తదితర ఆరోపణల్ని నమోదు చేసింది. తనపై నమోదైన అభియోగాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం గోవాలోని బాంబే హైకోర్టు బెంచ్ ముందు ఉన్నందున ప్రస్తుతం విచారణను నిలిపివేయాలని తేజ్పాల్ చేసిన విజ్ఞప్తిని అదనపు సెషన్స్ జడ్జి విజయా పొల్ తిరస్కరించారు. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేశారు. ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు రుజువైతే తేజ్పాల్కు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. -
మరో వివాదంలో ఆప్ ఎంపీ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ సింగ్ ఏరికోరి మరీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ సారి మద్యం సేవించి పార్లమెంట్కు రావడం... మరోసారి పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టి వీడియో తీయడం.. తాజాగా జర్నలిస్టులను కించపరచడం. ఈ వివాదాలతో భగవత్ మన్ సింగ్కు ఎక్కడి లేని చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులను కించపరిచినందుకు ఎంపీకు వ్యతిరేకంగా పంజాబ్ బాసనీ పథానా పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హిందీ న్యూస్పేపర్లో పనిచేసే ఓ వర్కింగ్ జర్నలిస్టుపై దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ హిందీ జర్నలిస్టు భగవత్ మన్పై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. బాసీ పథానాలోని ఫతేగఢ్ సాహిబ్లో నిర్వహించిన ర్యాలీ వెన్యూకు ఆయన ఆలస్యంగా రావడంపై జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కోపోద్రుహులైన భగవత్ మన్, జర్నలిస్టుపై మీడియా ముందే దురుసుగా ప్రవర్తించారు. మీడియాను కించపరిచినట్టు మాట్లాడిన ఆప్ ఎంపీ, మీడియాను వెంటనే ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ప్రతి జర్నలిస్టుకు ఓ రేటు ఉంటుందని, మీడియా కవరేజ్ అవసరం లేని పార్టీ ఆప్నేనని కితాబు ఇచ్చుకున్నారు. వార్తలు రాయడానికి ప్రతి జర్నలిస్టు డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. -
బైబిల్ మిషన్ రిజిస్టర్డ్ సంస్థ
బైబిల్ మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్రజాక్ బాషా గుంటూరు ఈస్ట్ : భారత్పేటలో కేంద్ర కార్యాలయంగా నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ రిజిస్టర్డ్ సంస్థని బైబిల్ మిషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్ రజాక్బాషా తెలిపారు. బైబిల్మిషన్ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి మండలం హాఫ్పేట వద్ద తమ సంస్థ నిర్మిస్తున్న దైవ మందిరాన్ని ప్రస్తావిస్తూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తమ సంస్థ ఏపీ రిజిస్టర్ ఆఫ్ సొసైటీ నంబరు 311/2015 పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు. తమ సంస్థపై అసత్య ప్రచారాలు చేయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. తమపై విమర్శలు గుప్పిస్తున్న సంస్థ రిజిస్ట్రేషన్ కాలేదని వివరించారు. అటువంటివారిపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థ రిజిస్ట్రేషన్ పత్రాన్ని ప్రదర్శించారు. -
డిప్యూటీ జైలర్పై కేసు నమోదు
చాదర్ఘాట్: మలక్పేటలోని కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినిపై డిప్యూటీ జైలర్ వేధింపులకు గురి చేస్తున్న ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా సబ్ జైల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినిపై డిప్యూటీ సూపరింటెండెంట్ రాహుల్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదును నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
కొనసాగుతున్న అరెస్టుల పరంపర
-
సీఎంపై ఈడీ కేసు నమోదు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై మరోసారి చిక్కుల్లోపడ్డారు. తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఈ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలోననా సీఎంను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎంతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా త్వరలోనే ప్రశ్నించనుంది. అవినీతి నిరోధక శాఖ ఢిల్లీ కేంద్ర కార్యాలయ సహకారంతో రాష్ట్రంలోని సిమ్లాలోని ఈడీ కార్యాలయం కేసును దర్యాప్తు చేస్తుందని ఈడీ వర్గాలు తెలిపాయి. సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి సుమారు రూ. 6.1 కోట్ల మేర అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ. ఈ క్రమంలో ఆయన భార్య ప్రతిభాసింగ్, కొడుకు విక్రమాదిత్య, కూతురు అపరాజితలపై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది. వీరితోపాటు ఎల్ ఐసీ ఏజెంట్ అనంద్ చౌహాన్, అతని సోదరుడు సీఎల్ చౌహాన్ పేర్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది. కాగా సీబీఐ అధికారులు ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆయన ఇళ్లతోపాటు న్యూఢిల్లీలోని 11 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో 6 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వీరభద్ర సింగ్ అరెస్టయ్యే అవకాశం ఉందని ఊహాగానాలుకూడా వినిపించాయి. అయితే అనూహ్యంగా వీరభద్ర సింగ్ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు ఆయన అరెస్ట్ పై స్టే విధించింది. -
ప్రకాశంజిల్లాలో కీచకపర్వం