విమాన ప్రయాణికులకు ఊరట.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌! | No Physical Boarding Pass Needed for Immigration From September 1 | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికులకు ఊరట.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్‌!

Aug 25 2026 2:25 AM | Updated on Aug 25 2026 2:34 AM

No Physical Boarding Pass Needed for Immigration From September 1

న్యూఢిల్లీ: దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల ఇమిగ్రేషన్‌ క్లియరెన్స్‌కి ఇకపై ఫిజికల్‌ బోర్డింగ్‌ పాస్‌ల అవసరం ఉండదు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌ల్లోని ఈ–బోర్డింగ్‌ పాస్‌ చూపిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై ఫిజికల్‌ స్టాంపింగ్‌ ప్రక్రియను తొలగించడం ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఇమిగ్రేషన్‌ బ్యూరో (బీవోఐ) వెల్లడించింది.

హోమ్‌ శాఖలో భాగమైన బీవోఐ సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేసింది. ఎఫ్‌టీఐ–టీటీపీ (ఫాస్ట్‌ ట్రాక్‌ ఇమిగ్రేషన్‌–ట్రస్టెడ్‌ ట్రావెలర్‌ ప్రోగ్రాం) కింద నమోదు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ–గేట్స్‌ వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. పేపర్‌రహితమైన, సాఫీ ప్రయాణానికి ఈ విధానం దోహదపడగలదని బీవోఐ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement