
న్యూఢిల్లీ: ఆటోమొబై ల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) గత రెండు దశాబ్దాల్లో రికార్డు స్థాయిలో పాత కార్లను విక్రయించింది. సంస్థలో భాగమైన ట్రూ వేల్యూ 22 ఏళ్లలో 50 లక్షల వాహనాలను అమ్మింది.
ట్రూ వేల్యూ 2001లో ఏర్పాటైంది. ప్రస్తుతం 281 నగరాల్లో 560 అవుట్లెట్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. ‘మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పరిశ్రమలో విజయవంతంగా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.
50 లక్షల మంది కొనుగోలుదారులకు సంతోషాలను పంచింది. వారి ప్రథమ ఎంపికగా ఎదిగింది‘ అని ఎంఎస్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.