
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రంతో వైఫై సేవలు అందించడంపై రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 26 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ టెలికం శాఖలో సాంకేతిక విభాగమైన టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్కి (టీఈసీ) కంపెనీ విజ్ఞప్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2022 స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం 5జీ కోసం కేటాయించిన స్పెక్ట్రంను వేరే టెక్నాలజీ కోసం ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2022లో నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి. రూ. 88,078 కోట్ల బిడ్లతో జియో ఇందులో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది.