
13.5 బిలియన్ డాలర్లు
2024–25లో 23 బిలియన్ డాలర్ల లోటు
ఆర్బీఐ డేటా విడుదల
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి/క్యూ4) కరెంటు ఖాతా 13.5 బిలియన్ డాలర్ల (రూ.1.15 లక్షల కోట్లు) మిగులులోకి వచ్చినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంటు ఖాతా 4.6 బిలియన్ డాలర్ల మిగులుగా ఉండడం గమనార్హం.
గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే కరెంటు ఖాతా లోటు 23.3 మిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.6 శాతం) ఉంది. 2023–24లో కరెంటు ఖాతా లోటు 26 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.7 శాతం) కావడం గమనించొచ్చు. వస్తువులకు సంబంధించి వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 59.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 52 బిలియన్ డాలర్లుగానే ఉంది. సేవలకు సంబంధించి నికర మిగులు 53.3 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 42.7 బిలియన్ డాలర్ల మేర ఉంది.
బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ
క్యూ4లో బిలియన్ డాలర్ల (రూ.8,400 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎఫ్డీఐ 10.2 బిలియన్ డాలర్లతో పోలి్చచూస్తే గణనీయంగా తగ్గాయి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు క్యూ4 లో నికరంగా 5.9 బిలియన్ డాలర్ల మేర బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు క్యూ4లో 8.8 బిలియన్ డాలర్ల మేర నికరంగా పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పెరుగుదల 30.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
విదేశీ రుణం 736 బిలియన్ డాలర్లు
ప్రభుత్వ విదేశీ రుణ భారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే 10 శాతం పెరిగి 736.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 మార్చి నాటికి ఇది 668.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో విదేశీ రుణ భారం 18.5 శాతం నుంచి 19.1 శాతానికి పెరిగింది.