'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు' | India To Have 12 3 Crore Electric Vehicles On Road By 2032 | Sakshi
Sakshi News home page

'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'

May 6 2025 9:04 PM | Updated on May 6 2025 9:16 PM

India To Have 12 3 Crore Electric Vehicles On Road By 2032

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ మరియు కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ విడుదల చేసిన ఒక నివేదికలో.. 2032 నాటికి ఇండియాలో 12.3 కోట్ల వాహనాలు ఉంటాయని వెల్లడించింది.

దేశం అభివృద్ధి వైపు సాగుతున్న సమయంలో.. 2070 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా వాహన కొనుగోలుదారులు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే 2030 నాటికి భారతీయ రోడ్లపై ఉన్న వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగం లేదా కొనుగోలును పెంచడానికి ఫేమ్-2 వంటి స్కీమ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ డిమాండును ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా.. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెంపుకు కూడా దోహదపడుతుంది.

ఇదీ చదవండి: చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

2030 నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్లు 80 శాతానికి, ఫోర్ వీలర్స్ 30 శాతం, కమర్షియల్ కార్లు 70 శాతం, ఎలక్ట్రిక్ బస్సులు 40 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు పెరిగితే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 76000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2032 నాటికి 21 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement