ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్‌ | Increase in exports, improvement in CAD, manufacturing will help boost Indian economy says Piyush Goyal | Sakshi
Sakshi News home page

ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్‌

Jul 1 2024 4:39 AM | Updated on Jul 1 2024 8:18 AM

Increase in exports, improvement in CAD, manufacturing will help boost Indian economy says Piyush Goyal

కేంద్ర మంత్రి గోయల్‌ వెల్లడి 

ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్‌ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్‌) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్‌ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement