బ్యాటరీ సేవ్‌ చేసే డిస్‌ప్లే.. యాపిల్‌ కసరత్తు | How Apple planning to launch next generation power saving display | Sakshi
Sakshi News home page

బ్యాటరీ సేవ్‌ చేసే డిస్‌ప్లే.. యాపిల్‌ కసరత్తు

Jun 19 2025 11:57 AM | Updated on Jun 19 2025 1:37 PM

How Apple planning to launch next generation power saving display

యాపిల్ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఐఫోన్లలో కొత్త పవర్ సేవింగ్ డిస్‌ప్లేను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 18 ఎయిర్‌లో దీన్ని అమలు చేసే వీలుందనే అంచనాలు వెలువడుతున్నాయి. స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పవర్‌ అధికంగా ఖర్చు అవుతుంది. దాంతో స్లిమ్‌ ఫోన్లకు ఇదో సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్‌ను పెంచేలా, డిస్‌ప్లేకు ఖర్చు అయ్యే పవర్‌ను తగ్గించేలా కొత్త టెక్నాలజీలను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 18 ఎయిర్‌లో ఈమేరకు టెక్నాలజీను వాడనుందని కొన్ని సంస్థలు తెలిపాయి.

పరిమిత బ్యాటరీ లైఫ్‌ సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ శక్తిని వినియోగించేలా నెక్ట్స్ జనరేషన్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను వాడాలని యాపిల్‌ పరిశీలిస్తోంది. ఇప్పటికే వీటి సరఫరాదారులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2027లో ఐఫోన్ 18 ఎయిర్‌లో ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ అధునాతన వెర్షన్ను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్‌లో కొత్త డిస్‌ప్లే ప్యానెల్ టెక్నాలజీని ఉపయోగించాలని యాపిల్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన హైఎండ్ ఐఫోన్లలో ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. కాని డిస్‌ప్లే అంతర్గత భాగాల్లో కొంత భాగం మాత్రమే ఆక్సైడ్ పదార్థాలను వాడుతోంది.

ఇదీ చదవండి: 9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్‌

కొత్త డిప్‌ప్లేల్లో పూర్తి ఆక్సైడ్ ఆధారిత డిజైన్‌కు మారడం ద్వారా మరింత సమర్థవంతంగా సర్వీసు అందించాలని యోచిస్తోంది. అయితే ఈ అప్‌గ్రేడ్ అంత సులభం కాదనే వాదనలున్నాయి. ఇది తయారీ ప్రక్రియలో సంక్లిష్ట మార్పులను కలిగి ఉంటుంది. దాంతో ఈ ప్యానెళ్లు మరింత ఖరీదుగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement