
దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఆగకుండా దూసుకెళ్తున్నాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలు నేడు (March 31) మళ్లీ భారీగా ఎగిసి కొత్త మార్క్ను తాకాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత నిరుత్సాహం తప్పలేదు.
బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 84,250 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 91,910 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు ఏకంగా రూ.650, రూ.710 చొప్పున ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.92,060 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.84,400 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.710, రూ.650 చొప్పున పెరిగాయి.
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,250 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,910 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.650, రూ.710 చొప్పున పెరిగాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,13,000 వద్ద, ఢిల్లీలో రూ. 1,04,000 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)