ఐపీవోకు ఫస్ట్‌ మెరిడియన్‌ బిజినెస్‌

First Meridian Business Services Files Fresh Ipo Papers With Sebi - Sakshi

న్యూఢిల్లీ: సిబ్బంది సరఫరా, నియామక సంస్థ ఫస్ట్‌ మెరిడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకోనుంది.

వెరసి తొలుత వేసిన రూ. 800 కోట్ల సమీకరణ ప్రణాళికలను తాజాగా సవరించింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి.

చదవండి: మెడికల్‌ లైసెన్సింగ్‌ పరీక్షల్లో చాట్‌జీపీటీ పాస్‌..ఇకపై విద్యార్ధులకు పేపర్‌పైనే పరీక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top