ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ కొత్త రూల్స్ వచ్చేశాయ్ | SEBI Overhauls Mutual Fund Regulations Know The Details Here | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ కొత్త రూల్స్ వచ్చేశాయ్

Dec 21 2025 8:20 PM | Updated on Dec 21 2025 8:34 PM

SEBI Overhauls Mutual Fund Regulations Know The Details Here

భారతదేశంలో చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అందరికీ లాభాలు వస్తాయని గానీ.. అందరూ నష్టపోతారని గానీ కచ్చితంగా చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు లాభాలు, మరికొన్ని సార్లు నష్టాలు ఉంటాయి.

లాభ, నష్టాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో.. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. దేశీయ మ్యూచువల్ ఫండ్‌లు బ్రోకరేజ్‌లకు చెల్లించే రుసుము మాత్రమే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో ప్రాథమిక నిర్వహణ ఛార్జీని కూడా తగ్గించింది.

SEBI బోర్డు సమావేశం తర్వాత, విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నగదు లావాదేవీలపై స్టాక్ బ్రోకర్లకు చెల్లింపును 8.59 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ గతంలో ఆస్తి నిర్వాహకులు చెల్లించే రుసుముపై 2 బేసిస్ పాయింట్ల రుసుమును ప్రతిపాదించింది.

కొత్త రూల్స్
➤కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న పెద్ద వాటాదారులను మినహాయించి, పబ్లిక్ ఇష్యూలలో ఉన్న వాటాదారులకు లాక్ ఇన్ అవసరాలను రెగ్యులేటర్ చేసింది.

➤కొత్త నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ పబ్లిక్‌గా విడుదల కావడానికి ముందు, షేర్లకు లాక్-ఇన్ అవసరాలు స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. ఇది లిస్టింగ్ ప్రక్రియలో ఆలస్యాలను పరిష్కరిస్తుందని సెబీ తెలిపింది.

➤ఐపీఓకు ముందు షేర్ల లాక్-ఇన్ నిబంధనల సవరణకు సెబీ ఆమోదం తెలపడంతో, అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యాచరణ సవాలు ఇప్పుడు పరిష్కారమైందని.. కార్పొరేట్ కంప్లైయన్స్ సంస్థ MMJC అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి మకరంద్ జోషి అన్నారు.

➤పెట్టుబడిదారుల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, జారీ చేసే కంపెనీలు పబ్లిక్ ఆఫర్ పేపర్లలో భాగంగా కీలక సారాంశాన్ని అప్‌లోడ్ చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది.

➤మహిళలు, రిటైల్ & సీనియర్ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి.. రుణ ఇష్యూలలో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ చర్యలను ఆమోదించింది.

➤రిస్క్ మేనేజ్‌మెంట్ చర్యలకు లోబడి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలను రేట్ చేయడానికి అనుమతించబడతాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే రెగ్యులేటర్ బోర్డు సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. టేకోవర్ కోడ్ నిబంధనలను సవరించడానికి నియంత్రణ సంస్థ కూడా కృషి చేస్తోందని ఆయన అన్నారు.

ఖర్చులను తగ్గించి.. మ్యూచువల్స్ ఫండ్స్‌లో పారదర్శకతను పెంచడానికి సెబీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఈ ఏడాది (2025) చాలామంది ఇన్వెస్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. దీంతో ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్టర్లు నిపుణుల సలహా లేదా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement