
మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ (MHRIL)లో ప్రధాన బ్రాండ్ అయిన 'క్లబ్ మహీంద్రా' దాని పోర్ట్ఫోలియోలో మూడు కొత్త రిసార్ట్లను జోడించినట్లు ప్రకటించింది. బ్రాండ్ విస్తరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోకి కూడా ప్రవేశించింది. అంతే కాకుండా.. బ్రాండ్ వియత్నాంలోని సైగాన్ ప్రాంతం.. అబుదాబిలో కూడా తన ఉనికిని బలోపేతం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని గోదావరిలోని దిండి ఆర్వీఆర్.. అద్భుతమైన నదీతీర రిట్రీట్ గంభీరమైన గోదావరి నది వెంబడి ఉంది. పచ్చని కొబ్బరి తోటలు, సుందరమైన బ్యాక్ వాటర్లతో చుట్టుముట్టబడిన ఈ రిసార్ట్, కుటుంబం & స్నేహితులతో కాలం గడపడానికి అనువైన ప్రదేశం. ఈ రిసార్ట్లో 100 గదులు ఉన్నాయి. మొదటి దశలో 50 గదులు ప్రారంభమవుతాయి. మిగిలిన 50 గదులు ఈ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి ప్రారంభమవుతాయని సమాచారం.