ఏప్రిల్‌లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు | Best Selling EV Brands in April 2025 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు

May 3 2025 9:21 PM | Updated on May 4 2025 11:00 AM

Best Selling EV Brands in April 2025

భారతీయ మార్కెట్లో.. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఫోర్ వీలర్స్, టూ వీలర్స్) డిమాండ్ పెరుగుతోంది. అమ్మకాల్లో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. గత నెలలో (2025 ఏప్రిల్‌) దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు జరిపిన ఐదు కంపెనీల గురించి తెలుసుకుందాం.

వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఏప్రిల్ 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా టీవీఎస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కంపెనీ గత నెలలో 19,736 యూనిట్లను విక్రయించి 154 వృద్ధిని పొందింది. 2024 ఏప్రిల్‌లో కంపెనీ మొత్తం సేల్స్ 7,762 యూనిట్లు.

ఓలా ఎలక్ట్రిక్ 2025 ఏప్రిల్‌లో 19,709 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఈ అమ్మకాలు 2024 ఏప్రిల్‌ (34163 యూనిట్లు) కంటే 42 శాతం తక్కువ.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు

2025 ఏప్రిల్‌లో బజాజ్ అమ్మకాలు 19,001 యూనిట్లు కాగా.. ఏథర్, హీరో కంపెనీల సేల్స్ వరుసగా 13,167 యూనిట్లు, 6,123 యూనిట్లు. ఈ మూడు కంపెనీలు అమ్మకాలు వరుసగా 151 శాతం, 218 శాతం, 540 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈ మూడు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement