వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు | Auto industry crosses Rs 20 lakh crore mark in FY24 | Sakshi
Sakshi News home page

వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు

Sep 10 2024 4:21 AM | Updated on Sep 10 2024 8:01 AM

Auto industry crosses Rs 20 lakh crore mark in FY24

మొత్తం జీఎస్‌టీలో 15 శాతం వాటా 

సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్‌ పరిశ్రమ టర్నోవర్‌ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్‌టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు.

 అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్‌ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్‌ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు.  

100 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్‌ 
భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని  వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్‌ ఇండస్ట్రియల్‌ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్‌íÙప్‌ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్‌ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement