-
యాపిల్ ఇండియాకు ఐఫోన్ల జోష్
న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇండియా అక్టోబర్–డిసెంబర్ కాలానికి టర్నోవర్లో సరికొత్త రికార్డ్ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాక్టివ్ డివైస్ల సంఖ్య 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్ పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్సంగ్ ముందుంది. కోటి యూనిట్ల షిప్మెంట్ల ద్వారా యాపిల్ ఆదాయంలో టాప్ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్ పీసీ అమ్మకాలు ఫ్లాట్గా 7.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
3గిఫ్ట్ నిఫ్టీ టర్నోవర్ రికార్డ్
న్యూఢిల్లీ: గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఒకే రోజులో 15.25 బిలియన్ డాలర్ల(రూ. 1.27 లక్షల కోట్లు) టర్నోవర్ను సాధించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. 38.63 లక్షల కాంట్రాక్టుల ద్వారా రికార్డ్ నమోదైంది. వెరసి ఈ ఏడాది ఆగస్ట్ 29న సాధించిన 12.98 బిలియన్ డాలర్ల రికార్డ్ టర్నోవర్ను అధిగమించినట్లు ఎన్ఎస్ఈ ఐఎక్స్ వెల్లడించింది. నిఫ్టీ–50 ఇండెక్స్ ఆధారంగా డాలర్లలో ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు గిఫ్ట్ నిఫ్టీ వేదికగా నిలిచే సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ ఐఎక్స్.. గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మలీ్టఅసెట్ ఎక్సే్ఛంజ్. ఈ ఏడాది(2023) జులై 3నుంచి గిఫ్ట్ నిఫ్టీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఎన్ఎస్ఈ ఐఎక్స్లో ట్రేడింగ్ టర్నోవర్ ఊపందుకుంది. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ మొదలయ్యాక తొలి రోజు నుంచి ఇప్పటివరకూ 4.59 మిలియన్ కాంట్రాక్టుల ద్వారా 178.54 బిలియన్ డాలర్ల విలువైన టర్నోవర్ నమోదైంది. ఎన్ఎస్ఈ ఐఎక్స్ విభిన్న ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. దేశీ సింగిల్ స్టాక్ డెరివేటివ్స్, ఇండెక్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్సహా.. డిపాజిటరీ రిసీప్ట్స్, గ్లోబల్ స్టాక్స్ను ఆఫర్ చేస్తోంది. -
కళలతో కోట్లు.. వీరి టర్నోవర్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!
రామ్ వి సుతార్ తరహాలో గొప్ప పేరు సంపాదించుకున్న శిల్పకారులు మనదేశంలో చాలామంది ఉన్నారు. వీరు విదేశాలలో కూడా పేరు సంపాదించారు. వీరిలో శిల్పి అనీష్ కపూర్ ఒకరు. వీరి కళాఖండాలు విదేశాలలో కూడా విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. తాజా నివేదికల ప్రకారం ప్రస్తుతం లండన్లో ఉంటున్న అనీష్ కపూర్ అత్యధిక ఆదాయం పొందుతున్న భారతీయ శిల్పకారునిగా గుర్తింపు పొందారు. అతని టర్నోవర్ అతని విజయ గాథను తెలియజేస్తుంది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం 69 ఏళ్ల అనీష్ కపూర్ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన 50 మంది శిల్పకళా కళాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అనీష్ టర్నోవర్ ఏడాదికి రూ. 91 కోట్లుగా ఉందని పలు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పుకునే నటీనటులకు మించి అనీష్ ఆదాయం ఉంది. అగ్రస్థానంలో అనీష్ కపూర్ లండన్లో నివసిస్తున్న అనీష్ కపూర్ శిల్ప హస్తకళాకారునిగా సక్సెస్ అయ్యారు. అతని కళాఖండాలలో ఒకటి 9.27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడమే దీనికి ఉదాహరణగా నిలిచింది. ఖరీదైన ఆర్ట్వర్క్ల కారణంగా భారత్ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఆర్ట్ జాబితాలో అగ్రస్థానంలో ఉందని తాజా రిపోర్టు తెలియజేస్తోంది. జులై 31న విడుదల చేసిన ఈ జాబితాను వేలంలో విక్రయించిన కళాఖండాల ఆధారంగా తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం భారతదేశపు ప్రఖ్యాత పెయింటర్ అర్పితా సింగ్ రూపొందించిన ఒక కళాఖండం 24.71 కోట్ల రూపాయల టర్నోవర్తో 11.32 కోట్ల రూపాయలకు విక్రయమయ్యింది. అనీష్ కపూర్ తర్వాత ఆమె రెండో స్థానంలో నిలిచింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఇండియా ఆర్ట్ లిస్ట్ 2023 ప్రకారం భారతీయ చిత్రకారుడు జోగెన్ చౌదరి మూడవ స్థానంలో ఉన్నారు. కళాకారుడి మొత్తం టర్నోవర్ రూ.19.76 కోట్లు. అతను రూపొందించిన ఏడు అత్యంత ఖరీదైన కళాఖండాలు రూ.4.40 కోట్లకు వేలం వేశారు. అదే విధంగా కళాకారుడు గులాం మహ్మద్ షేక్ టర్నోవర్ రూ.17.88 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ముంబైకి చెందిన అనీష్ కపూర్ 1972లో బ్రిటన్కు వెళ్లారు. అతను చక్కటి కళాఖండాలను రూపొందించడంలో నైపుణ్యం సాధించారు. బ్రిటన్లోని టేట్ మోడరన్ టర్బైన్ హాల్తో పాటు, చికాగోలోని మిలీనియం పార్క్లో కూడా అనిష్ రూపొందించిన శిల్పాలు కనిపిస్తాయి 2018-19 సంవత్సరంలో అనీష్ కపూర్ టర్నోవర్ రూ. 168.25 కోట్లు. 1991 సంవత్సరంలో అనీష్కు టర్నర్ ప్రైజ్ లభించింది. ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా! -
వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!
ఎవరైనా స్కూలుకెల్లే వయసులో అల్లరి చేస్తారు.. గేమ్స్ ఆడుకుంటారు. ఇవి తప్పా వేరే ఆలోచన కూడా సరిగ్గా ఉండదు. అయితే ఇలాంటి ఆలోచనలకు భిన్నంగా హైదరాబాద్కు చెందిన 'సంకర్ష్ చందా' (Sankarsh Chanda). కేవలం 17 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు. సంకర్ష్ చందా హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన తరువాత 2016లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రూ. 2000లతో ప్రారంభించి కేవలం రెండేళ్లలో అదనపు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఒక సంవత్సరంలో తాను సుమారు రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టానని, రెండు సంవత్సరాల్లో ఆ షేర్ల విలువ రూ. 13 లక్షలకు చేరిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సంకర్ష్ చందా 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఆ సమయంలో తన చదువుకి స్వస్తి చెప్పి స్టాక్లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్టెక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. చదువు మానేసి తన మొత్తం దృష్టిని కేవలం దీనిపైనే నిమగ్నం చేశారు. సొంతంగా బిజినెస్ స్టార్ చేసినందుకు 2017లోనే తన 8 లక్షల షేర్లను విక్రయించాడు. స్టార్టప్ల సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడిగా పెట్టాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. తన మొత్తం ఆస్తులు ఇప్పుడు రూ. 100 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. ఇది మొత్తం తన మొత్తం స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. 14 సంవత్సరాల వయసులో ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త బెంజిమన్ గ్రాహం కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి ఎక్కువ పుస్తకాలు చదవడం, డబ్బు పట్ల మానవ ప్రవర్తన గురించి తెలుసుకోవడం ప్రారంభించినట్లు సంకర్ష్ చందా చెబుతున్నాడు. (ఇదీ చదవండి: తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!) తాను చదవడానికి కూడా పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఒకవేల నేను సొంతంగా పుస్తకాలను కొంటే వాటిని ఉంచడానికి కనీసం నాకు రెండు, మూడు గదులు కావాల్సి వస్తుంది. దానికి అదనపు డబ్బు కావాల్సి వస్తుంది. అందుకే బుక్స్ కొననని చెప్పాడు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) బిగ్ బుల్ రాకేష్ ఝున్జున్వాలా అడుగుజాడల్లో నడుస్తూ.. చదువుకు స్వస్తి చెప్పి నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్
వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం అలాంటి ముగ్గురు స్నేహితుల విజయగాథ ఇది. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోట్ల రుపాయలు టర్నోవర్ చేస్తున్నారు. అందరిలానే చదువు పూర్తి చేసుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేసి సంతృప్తి చెందక వ్యాపారం వైపు అడుగులు వేశారు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర. 2 లక్షలు పెట్టుబడి.. 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేద్దామని అనుకునే సమయానికి వారి వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రం ఉంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి 2010లో ఫ్లవర్ ఆరా పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఇందులో పూలు, కేకులు, బహుమతులు వంటి వస్తువులకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందిస్తూ వచ్చారు. ప్రారంభంలో, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. అదే ఉద్యోగి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా పని చేయడంతో సహా కార్యకలాపాలు, డెలివరీ వంటి అన్ని అంశాలను నిర్వహించేవాడు. అనుకోకుండా వాలెంటైన్స్ డే వాళ్ల కంపెనీకి చాలా ఆర్డర్లు వచ్చాయి. స్టాఫ్ ఒక్కరే కావడంతో సహ వ్యవస్థాపకులు హిమాన్షు, శ్రే కూడా డెలివరీ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా సందర్భాల్లో కేకులు ఎక్కువగా విక్రయాలు జరుగుతుండడం గమనించారు. దీంతో 2016 సంవత్సరంలో బెకింగో అనే కొత్త బ్రాండ్ను ప్రారంభించారు. ఈ కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఒకే బ్రాండ్కు చెందిన తాజా కేక్లను డెలివరీ చేస్తూ బెకింగోని విస్తరింపజేశారు. ప్రస్తుతం, కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు మీరట్, పానిపట్, రోహ్తక్ కర్నాల్ వంటి చిన్న నగరాలకు సేవలందిస్తోంది. కంపెనీ విక్రయాల్లో 30 శాతం వెబ్సైట్ ద్వారానే 70 శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో ద్వారా జరుగుతున్నాయి. అలా 2021-22లో బెకింగో 75 కోట్లకు పైగా టర్నోవర్ చేరకుంది. ప్రస్తుతం కంపెనీలో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ ఈ ఏడాది తన మొదటి ఆఫ్లైన్ అవుట్లెట్ను ఢిల్లీలో ప్రారంభించింది. చదవండి: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement